News April 3, 2025
అంబటి ఫిర్యాదు నమోదు చేయండి: హైకోర్టు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు వెంటనే నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ, సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అంబటి ఫిర్యాదు చేశారు. మొత్తం ఐదు ఫిర్యాదులు ఇవ్వగా నాలుగు మాత్రమే నమోదు చేయడంతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు.
Similar News
News October 27, 2025
గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 75వేల బస్తాల ఏసీ సరకు అమ్మకానికి వచ్చింది. ఏసీ రకం మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్య ధరలు క్వింటాలుకు ఈ విధంగా ఉన్నాయి. పసుపు రకం: రికార్డు స్థాయిలో రూ.20 వేల నుంచి రూ. 23 వేల వరకు పలికింది. తేజా, 355, 341 రకాలు: రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు ధరలు నమోదయ్యాయి. నంబర్ 5 ఏసీ రకం గరిష్టంగా రూ. 15,500 వరకు ధర పలికింది. నాటు సూపర్ 10: రూ.15వేలు వరకు పలికింది.
News October 27, 2025
GNT: మొంథా తుపాన్.. అనిశ్చితితో రైల్వే ప్రయాణికులు

మొంథా తుపాన్ ప్రభావంతో రైల్వే ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. అప్పటికే జిల్లా అధికారులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించడంతో గాలి వానల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా, కొన్ని సేవలు రద్దు అయ్యే అవకాశం ఉండటంతో.. ప్రయాణం కొనసాగుతుందా?, లేదా? అన్న అనిశ్చితితో ప్రయాణికులు ఉన్నారు. అయితే రైల్వే అధికారులు మాత్రం తుపాను నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో తీసుకురాలేదు.
News October 27, 2025
GNT: తుపాను సహాయక చర్యలకు రూ. 50 లక్షలు విడుదల

తుపాను సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 50 లక్షలను విడుదల చేసింది. ఈ నిధులను బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం సరఫరా చేయడం. వైద్య శిబిరాల నిర్వహణ, పారిశుద్ధ్యం, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అవసరమైతే బాధితులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సూచించింది.


