News February 16, 2025
అంబేడ్కర్ కోనసీమ: 18న పరస్పర అవగాహన సదస్సు

విదేశాలలో వివిధ రకాల ఉద్యోగాలు, ఉపాధిని పొంది కుటుంబాలను పోషించాలనుకునేవారు, విదేశాలకు వెళ్లి మోసపోయిన వారు, విదేశాలకు వెళ్లే వారికి మధ్యవర్తిత్వం వహించే ఏజెంట్లతో ఈనెల 18న పరస్పర అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం 18వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహిస్తామన్నారు.
Similar News
News July 7, 2025
సంగారెడ్డి: యాప్లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను అందులోనే నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధాన ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 7, 2025
వరంగల్: అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీలు..!

జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా ఇందులో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా గ్రామాల్లో ప్రత్యేక పాలనే నడుస్తోంది. దీంతో కార్యదర్శులు అన్నీ తామై అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి దాదాపు రూ.2 లక్షలకు పైగా అప్పు చేశామని వాపోతున్నారు.
News July 7, 2025
నూజివీడు: అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నేడు జరిగింది. సకాలంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే అధికారులు సరైన సమయానికి రాలేదు. ఇలాంటి ఘటనలు పునారవృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.