News April 14, 2025

అంబేద్కర్‌కి ఎస్పీ ఘన నివాళి

image

అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. రాయచోటి ఎస్పీ ఆఫీసులో అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు లర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకం అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా ఎదిగిన మహనీయుడు అన్నారు.

Similar News

News April 15, 2025

పంజాబ్‌కు ‘మ్యాక్సీ’మమ్ నిరాశే

image

పంజాబ్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ మరోసారి నిరాశపరిచారు. KKRతో మ్యాచులో కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను ముందుండి నడిపించాల్సింది పోయి వరుణ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యారు. గత మ్యాచుల్లోనూ మ్యాక్సీ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మొత్తంగా ఈ సీజన్లో 6 మ్యాచుల్లో 41 పరుగులే చేశారు. దీంతో జట్టుకు భారంగా మారారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

News April 15, 2025

సుందరీమణులు పాల్గొనే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని HNK కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో భాగంగా సుందరీమణులు కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News April 15, 2025

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు.!

image

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు. వీటిలో 110 ఎస్‌జీటీ, 69 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 199 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 69 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 130 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.

error: Content is protected !!