News December 23, 2025

అక్రమ ఇసుక రవాణాపై నిఘా ఉంచాలి: జిల్లా కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ముమ్మర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ రవాణా జరిగే ప్రధాన కూడళ్లలో తక్షణమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 25, 2025

ఎన్టీఆర్: హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనుల ప్రారంభం

image

రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ గురువారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన పూజలు నిర్వహించారు. 2027కల్లా హైకోర్టు నిర్మాణం పూర్తవుతుందని, B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. 45 వేల టన్నుల స్టీల్ వినియోగిస్తూ, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమరావతిలో హైకోర్టు కడుతున్నామన్నారు.

News December 25, 2025

కమ్మర్‌పల్లి: కారు ఢీ.. ఒకరి మృతి

image

కమ్మర్‌పల్లి మండలం రాజరాజేశ్వరి నగర్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాల గంగాధర్(70) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది గంగాధర్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News December 25, 2025

ప్రస్తుతం నా క్రష్ మృణాల్ ఠాకూర్: నాగవంశీ

image

హీరోయిన్లలో రష్మిక అంటే ఇష్టమని, మృణాల్ ఠాకూర్ తన క్రష్ అని నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరోవైపు Ntr నటించిన ‘వార్-2’కు భారీ నష్టాలంటూ జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు. ‘తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.68 కోట్లకు కొన్నాను. దానికి రూ.35-40 కోట్ల షేర్ వచ్చింది. ఈ క్రమంలో ఆ మూవీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పిలిచి రూ.18 కోట్లు వెనక్కి ఇచ్చింది. పెద్దగా నష్టాలు రాలేదు’ అని పేర్కొన్నారు.