News October 17, 2024

అక్రమ కేసులు పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోండి: BRS

image

మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై బెదిరింపులు అధికమవుతున్నాయని, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు యాదగిరి ఉన్నారు.

Similar News

News October 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

❤MBNR:19న అండర్-14,17 కరాటే ఎంపికలు❤రేపు ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక❤కొత్త ఉపాధ్యాయులకు ఘన సన్మానం❤PUలో రేపు,ఎల్లుండి సౌత్ జోన్ ఎంపికలు❤దుద్యాల: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి❤GDWL: రైలు కిందపడి ప్రభుత్వ టీచర్ మృతి❤రేపు అలంపూర్‌కు మంత్రుల రాక❤ఈనెల 31 నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు❤జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్ల మూసివేత

News October 17, 2024

గద్వాల: రైలు కిందపడి ప్రభుత్వ టీచర్ మృతి

image

రైలు కిందపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని నల్లకుంట వీధికి చెందిన శేఖర్ ప్రభుత్వ టీచర్. కాగా15రోజులుగా మానసికంగా ఇబ్బందిపడున్నాడన్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం రైల్వే పట్టాలపైకి వెళ్లి రైలు కిందపడి మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News October 17, 2024

రేపు అలంపూర్‌కు మంత్రుల రాక

image

రాష్ట్ర మంత్రులు రేపు అలంపూర్ జోగులాంబ దేవిని దర్శించుకోవడానికి వస్తున్నట్టు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. రేపు గద్వాలలో గ్రంధాలయం ఛైర్మెన్‌గా నీలి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణరావు హాజరవుతారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం వీరంతా ప్రమాణస్వీకారంలో పాల్గొనున్నారు.