News April 8, 2024
అక్రమ నగదు రవాణపై నిఘా పెంచండి: కలెక్టర్

ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు లావాదేవీలు, రవాణా జరగకుండా నిఘా పెంచాలని వివిధ శాఖల జిల్లా అధికారులను, విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్, ఇఎస్ఎంఎస్ (ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్) నోడల్ ఆఫీసర్ల సమావేశాన్ని కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం నిర్వహించారు. సీజర్స్ పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.
Similar News
News July 8, 2025
VZM: ‘బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయండి’

P4 కార్యక్రమంలో భాగంగా వెంటనే మార్గదర్శులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఆర్డివోలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లతో సోమవారం కలెక్టర్ తమ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 67,066 బంగారు కుటుంబాలను గుర్తించామని, వారి దత్తత ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు.
News July 8, 2025
జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద విజయనగరం జిల్లాలో 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలను నాటనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. 8 నియోజకవర్గాల్లో ఉన్న 27 మండలాల్లో సుమారుగా 477 మంది రైతులకు మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సపోటా, జామ మొదలగు 23 రకాల పండ్ల తోటలు మొక్కలు వేయుటకు సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
News July 7, 2025
బాధితుల సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరించాలి: VZM SP

బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని SP వకుల్ జిందాల్ అన్నారు. SP కార్యాలయంలో ఆయన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు చెందినవి 13, కుటుంబ కలహాలు 4, మోసాలకు పాల్పడినవి 5, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి 7 రోజుల్లో పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.