News March 6, 2026
అక్రమ మైనింగ్ను కట్టడి చేయాలి: కలెక్టర్

జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంతో పాటు మైనింగ్కు సంబంధించిన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సంబంధించిన అంశాలపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. సహజ వనరులను సంరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు.
Similar News
News April 14, 2026
KBR బార్ గొడవ కేసులో మరో ఇద్దరి అరెస్ట్: డీఎస్పీ

కర్నూలు కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో విద్యార్థి జాన్ వేస్లీ మృతి కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP ఉపేంద్ర బాబు తెలిపారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా రాజీవ్ నగర్కు చెందిన శాంతిరాజు రెడ్డి, తులాసాపురం శ్రీకాంత్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించినట్లు, వారి అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.
News April 14, 2026
నిరుద్యోగులకు జాబ్ మేళా

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.
News April 14, 2026
నిరుద్యోగులకు జాబ్ మేళా

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.


