News April 17, 2024
అక్రమ రవాణ కట్టడికి పటిష్ఠ చర్యలు: ఎస్పీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో భాగంగా తగిన రశీదులు లేకుండా మనుబోలు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 120 ఫ్యాన్లు, 24 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏఎస్ పేట పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3500 నగదు, 255 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News January 6, 2026
నెల్లూరు: తెల్లవారుజామున రైలు కింద పడి సూసైడ్

మనుబోలు- గూడూరు రైల్వే స్టేషన్ మధ్య చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో మూడో రైల్వే లైన్పై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయస్సు 45-50 ఉంటుందని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. మృతుడు పచ్చ రంగు ఫుల్ హాండ్స్ షర్టు బులుగు రంగు గళ్ల లుంగి ధరించి ఉన్నాడు. కుడి చేతికి ఎర్రని దారం కట్టుకొని ఉన్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 6, 2026
కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు EPFO తప్పనిసరి : కలెక్టర్

నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో వచ్చే విధంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం వారి ఛాంబర్లో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పని చేస్తున్న కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో నమోదు చేయాలన్నారు.
News January 6, 2026
కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు EPFO తప్పనిసరి : కలెక్టర్

నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో వచ్చే విధంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం వారి ఛాంబర్లో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పని చేస్తున్న కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో నమోదు చేయాలన్నారు.


