News September 30, 2025

అగ్నిమాపక నోటీసులపై మంత్రి అనిత సమీక్ష

image

హోంమంత్రి వంగలపూడి అనిత సీఐఐ ప్రతినిధులతో అగ్నిమాపక శాఖ జారీచేసిన నోటీసులపై సమీక్షించారు. హైకోర్టు ఆదేశాల మేరకే వివరణ కోరామని, ఎన్ఓసీలు రద్దు చేస్తారనేది అపోహ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పరిశ్రమల్లో భద్రతా పరికరాలపై అధ్యయనానికి, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు అంగీకరించారు. బాణసంచా దుకాణాలు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

Similar News

News October 1, 2025

దసరా రోజు కూడా రైతు బజార్

image

దసరా పండగను పురస్కరించుకుని బుధవారం కూడా ఎంవీపీ రైతు బజార్ తెరిచి ఉంటుందని ఎస్టేట్ అధికారి కె.వరహాలు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పండగకు అవసరమైన కొబ్బరికాయలు, పండ్లు, పువ్వులు, పూజా సామగ్రిని అందుబాటులో ఉంచామన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News September 30, 2025

భారత్-యూకే వాణిజ్య ఒప్పందంపై సదస్సు

image

విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ) ఆధ్వర్యంలో భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఒప్పందంలో సుంకం లేని యాక్సెస్, మార్కెట్ అవకాశాలు వంటి ప్రయోజనాలను అధికారులు ఎగుమతిదారులకు వివరించారు. యూకేకు ఎగుమతుల కోసం నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచించారు.

News September 30, 2025

స్త్రీశక్తి విజయంపై ఆర్టీసీ సిబ్బందికి సీఎం అభినందనలు: ఆర్‌ఎం

image

స్త్రీశక్తి పథకం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు ఆర్టీసీ సిబ్బందికి అభినందనలను తెలిపినట్లు రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు సిబ్బందికి చెప్పారు. మంగళవారం వాల్తేరు, గాజువాక, స్టీల్ సిటీ, సింహాచలం డిపోల్లో ఆయన పర్యటించారు. పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రజల మన్ననలు పొందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.