News August 14, 2025

అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. స్కూలింగ్ బిల్డింగ్ బ్లాక్స్ అనే అంశంపై జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అన్ని రంగాల్లోనూ కృషి చేయాలని ఆమె సూచించారు.

Similar News

News August 14, 2025

జగన్ ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారు: ఆనం

image

పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడంతో జగన్‌కు ప్రస్టేషన్ వచ్చిందని.. అదే ఊపులో మాట్లాడుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలిసారి పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు స్వేచ్ఛగా ఓటేశారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఓటర్లు గెలిపించారని కొనియాడారు. చంద్రబాబు వయస్సుకు జగన్ గౌరవం ఇవ్వాలని హితవు పలికారు.

News August 14, 2025

తిరుపతి స్విమ్స్‌లో MBBS అడ్మిషన్ల ప్రారంభం

image

తిరుపతి స్విమ్స్, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో MBBS అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలుకు చెందిన సాయిశ్రీ నిత్య నీట్-2025లో 14,255వ ర్యాంకు సాధించింది. ఆమెకు ఇక్కడ మొదటి అడ్మిషన్ ఇచ్చారు. ఆలిండియా కోటా ద్వారా ఈ కాలేజీకి 26 సీట్లు కేటాయించారు. ఓ అడ్మిషన్ పూర్తయ్యందని స్విమ్స్ ఉపకులపతి డా.ఆర్.వి.కుమార్ చెప్పారు.

News August 14, 2025

‘వార్ 2’ వచ్చేది ఈ OTTలోకేనా?

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ మూవీ ఇవాళ విడుదలైంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తుందని సమాచారం. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తుందని టాక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు.