News February 15, 2025

అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ

image

ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. గుర్రంకొండ మండలంలో యువతిపై యాసిడ్ దాడి ఘటన సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ మదనపల్లెలోని మఖాం వేశారు. జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు.

Similar News

News September 17, 2025

‘పార్వతీపురం జిల్లాలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు’

image

జిల్లాలో బలహీన వర్గాలు మరియు మధ్యతరగతి కుటుంబాల అవసరాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ పిజిఆర్ఎస్ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంగీకార అమలుపై అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ విధానంపై ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలని పేర్కొన్నారు.

News September 17, 2025

విశాఖలో గూగుల్ డేటా సెంటర్: సీఎం చంద్రబాబు

image

AP: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘విశాఖలో అద్భుతమైన వాతావరణం ఉంది. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళల భద్రతలో అగ్రస్థానంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు. దేశానికి ఆయనే సరైన నాయకుడని పేర్కొన్నారు.

News September 17, 2025

చందన్ వల్లి-కొడంగల్ రేడియల్ రోడ్డు: CM

image

ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో కొత్తగా రేడియల్ రోడ్లు వేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణలో ప్రజలకు, రైతులకు నష్టం జరగకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు. పరిశ్రమల కల్పవల్లి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్ వల్లి నుంచి కొడంగల్ వరకు 70 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణం త్వరలో చేపడతామని ప్రజాపాలన వేడుకల్లో సీఎం వెల్లడించారు.