News April 16, 2025
అచ్చంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. మార్చిరీలో శవం

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని ఈగలపెంట ఎస్ఐ వీరమల్లు తెలిపారు. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో గత కొన్ని రోజులుగా భిక్షాటన చేస్తూ ఉండేవాడని అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని అచ్చంపేట హాస్పిటల్కి గ్రామస్థులు తరలించారని ఆయన పేర్కొన్నారు. ఈయనను గుర్తుపట్టినవారు ఈగల పెంట పీఎస్, 8712657739, 8712657741, 9000901668 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News April 16, 2025
స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక ఉంచాలి: ఇన్ఛార్జి కలెక్టర్

జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత ఉండేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాల్లో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం ఇన్ఛార్జి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు అందించాలన్నారు.
News April 16, 2025
ADB: విద్యార్థులపై విష ప్రయోగం.. ఒకరి అరెస్టు: SP

ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై <<16115277>>విషప్రయోగం<<>> చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగుమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.
News April 16, 2025
పార్వతీపురం: ‘చిన్నారుల పెరుగుదలపై దృష్టి సారించాలి’

అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల బరువు, పెరుగుదల వయస్సు తగిన విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏ అంగన్వాడీ కేంద్రంలో అయితే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చిన్నారుల బరువు, పెరుగుదల ఉండదో అందుకు సూపర్వైజర్లు బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు.