News July 7, 2025
అచ్చంపేట: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తగిలి బాలుడు మృతి

ట్రాక్టర్ తగిలి నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన అచ్చంపేట మండలంలో నిన్న జరిగింది. ఏఎస్ఐ నరసింహారెడ్డి తెలిపిన వివరాలు.. శివారుతండాకి చెందిన హన్మంతు, తేజ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. హన్మంతు ట్రాక్టర్తో ఇంటి ఎదుట చదును చేస్తుండగా దాని వెనకే ఉన్న వారి చిన్న కొడుకు జశ్వంత్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ చక్రానికి తగిలాడు. ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News July 7, 2025
స్మార్ట్ కార్డులుంటేనే సచివాలయంలోకి ఎంట్రీ!

AP: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఎంట్రీకి స్మార్ట్ కార్డు సిస్టమ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రతి ఉద్యోగికి క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డు అందజేస్తారు. మెయిన్ గేట్ వద్ద వాహనాల నంబర్ను స్కాన్ చేసి అనుమతించనున్నారు. ఇందుకోసం టోల్గేట్ తరహా టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వివరాలు, వాహనాల నంబర్ల సేకరణ ప్రారంభమైంది.
News July 7, 2025
JNTU: రేపటితో ముగియనున్న మొదటి విడత కౌన్సెలింగ్

TG EAPCET ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో కొనసాగుతున్న మొదటి దశ కౌన్సిలింగ్ పక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల నమోదు పక్రియ ప్రారంభించారు. ఇలా పదో తేదీ వరకు విద్యార్థులు వారికి నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 171 ఇంజినీరింగ్ కళాశాలలో 1,07,218 సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి అధికారులు తీసుకొనివచ్చారు.
News July 7, 2025
NRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.