News March 24, 2025

అచ్చంపేట POLITICAL.. ‘ఫైర్ బ్రాండ్ జోష్ పెంచాలి’

image

పాలమూరు రాజకీయాల్లో అచ్చంపేట నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014, 2018లో వరుసగా BRS నుంచి గెలిచిన గువ్వల బాలరాజు 2023లో ఓడిపోయారు. ప్రత్యర్థుల మాటలకు దీటుగా కౌంటర్ ఇస్తూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న గువ్వల బాలరాజు ఇటీవల కొంత సైలెంట్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ గువ్వల బాలరాజు మరింత జోష్ పెంచాలని శ్రేణులు భావిస్తున్నాయి. మీ కామెంట్..?

Similar News

News July 9, 2025

గోదావరిఖని: దరఖాస్తు గడువు పొడిగింపు

image

రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఅండ్‌ఎండీ ఎన్‌.బలరాం బుధవారం తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో పాసై మెయిన్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు.

News July 9, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేకప్ పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

News July 9, 2025

తెలంగాణకు యూరియా కోత.. కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ

image

తెలంగాణకు యూరియా కేటాయింపులు 45% తగ్గించడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. రాజకీయ ప్రేరణతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధికంగా యూరియాను సరఫరా చేసి, తెలంగాణను ఉపేక్షించడం అన్యాయమన్నారు. RFCLలో తయారైన యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.