News April 4, 2025
అచ్యుతాపురంలో రోడ్డు ప్రమాదం.. ఫార్మా ఉద్యోగి మృతి

అచ్యుతాపురంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్వీఆర్ డ్రగ్స్లో పనిచేస్తున్న ఉద్యోగి బగాది రమణారావు దుర్మరణం చెందాడు. బైక్పై విధులకు వెళుతుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పరిశ్రమ యాజమాన్యం తగిన పరిహారం అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 25, 2025
నేడు ఆసీస్తో భారత్ చివరి వన్డే

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ ఇవాళ చివరిదైన 3వ వన్డే ఆడనుంది. తొలి 2 వన్డేల్లో ఆసీస్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా, నేటి మ్యాచ్ నామమాత్రం కానుంది. దీంతో ఇరుజట్లలో కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అటు ఇవాళ సిడ్నీలో మ్యాచ్ జరగనుండగా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఉదయం 9గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వన్డేలోనైనా భారత్ తిరిగి పుంజుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆటకు వర్షం ముప్పు లేదు.
News October 25, 2025
దూసుకొస్తున్న తుఫాన్.. ఆ జిల్లాల్లో 2 రోజులు సెలవులు?

AP: రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇదే బలమైన తుఫాన్ అని, ఈ నెల 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 నుంచి 4 రోజుల పాటు ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా 28, 29 తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులు సూచించారు. నేడు, రేపు చాలాచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
News October 25, 2025
లవ్ మ్యారేజ్ చేసుకుంటా: అనుపమ

కెరీర్ ప్రారంభంలో ట్రోల్స్ వల్ల తాను బాధపడినట్లు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. బిగినింగ్లో ఓ స్కూల్ ఈవెంట్కి వెళ్లిన ఫొటోలు వైరలవ్వగా డబ్బులిస్తే పాన్ షాపు ఈవెంట్లకూ వెళ్తారని తనపై ట్రోల్స్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించగా ఫ్యామిలీ అనుమతితో చేసుకుంటానని ఆమె బదులిచ్చారు. తాను ప్రత్యేకంగా ఎలాంటి డైట్ పాటించనని, నచ్చిన ఫుడ్ తింటానని చెప్పారు.


