News August 21, 2024
అచ్యుతాపురం: ముక్కలు ముక్కలైన శరీర అవయవాలు

అచ్యుతాపురం ఫార్మా ఘటనలో మనసును కలిచి వేసే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కొందరు కార్మికుల శరీర అవయవాలు ముక్కలుముక్కలయ్యాయి. కనీసం మృతదేహాలను గుర్తించే స్థాయిలో కూడా లేకపోవడం ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఫార్మాసిటీ సమీపంలోని ముళ్ల పొదల్లో మాంసం ముద్దలు పడి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Similar News
News September 22, 2025
విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
News September 22, 2025
సీఎంఆర్ షాపింగ్ మాల్లో తగ్గనున్న ధరలు

సీఎంఆర్ షాపింగ్ మాల్లో నేటి నుంచి నూతన జి.ఎస్.టి అమలు చేయనున్నట్లు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. రూ.1000 నుంచి రూ.2500 విలువ గల వస్త్రాలపై 12%గా ఉన్న జి.ఎస్.టి 5%గా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన జి.ఎస్.టి విధానం అమలుతో 6.25% వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు.. వినియోగదారులు గమనించాలన్నారు.
News September 22, 2025
విశాఖ పోలీసులకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు

విశాఖ పోలీసులకు అరుదైన గౌరవం దక్కింది. రోడ్డు ప్రమాద బాధితులకు విశాఖ సీపీ ఏర్పాటు చేసిన తక్షణ సహాయ కేంద్రంకు స్కోచ్ అవార్డు లభించింది.ఈ అవార్డును సెప్టెంబర్ 20న విశాఖ పోలీసులకు ప్రధానం చేసినట్లు విశాఖ సిపి శంక బ్రత బాగ్చి ఆదివారం ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశమైన మొట్టమొదటిసారిగా రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించడం పట్ల అవార్డు దక్కిందని పేర్కొన్నారు.