News September 21, 2025
అటవీశాఖ నిర్లక్ష్యం.. మూగజీవాల మనుగడకు ప్రమాదం

అటవీశాఖ నిర్లక్ష్యం కారణంగా కొండపల్లి రిజర్వు ఫారెస్ట్లో మూగజీవాల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది. అభయారణ్యంలో దుప్పిలు, కణుజులు, అడవి గొర్రెలు, పందుల వేట ముమ్మరంగా సాగుతోంది. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఉచ్చులు పన్నుతున్నారు. ఈ అడవి 30 వేల ఎకరాల్లో ఉంది.. అటవీ ప్రాంతంలోనే దుప్పి మాంసాన్ని వండుకుని, అక్కడే భుజించడం, మద్యం తాగి రావటం అన్నది పరిసర ప్రాంతాల వారికి సరదాగా మారిందని స్థానికులు అంటున్నారు.
Similar News
News September 21, 2025
జన్జీ ఉద్యమం వస్తుందన్న KTR.. బండి సంజయ్ రిప్లై ఇదే!

TG: నేపాల్ తరహాలో INDలోనూ జన్జీ ఉద్యమం రావొచ్చన్న <<17778245>>KTR కామెంట్స్పై<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘నేపాల్ జన్జీ నెపోటిజంపై పోరాడారు. తెలంగాణ జన్జీ వారి కంటే ముందే KCR, ఆయన పిల్లల్ని పక్కన పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో BRSకు బిగ్ జీరో ఇచ్చారు. ఫ్యామిలీ రూల్ను అంతం చేశారు’ అని ట్వీట్ చేశారు. KTRను నెపో కిడ్గా పేర్కొంటూ NDTV-YUVA కాన్క్లేవ్లో ఆయనకు యువత రియాలిటీని చూపించిందన్నారు.
News September 21, 2025
చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం: బుగ్గన

AP: పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్సారేనని అన్నారు. హంద్రీ-నీవాపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందులో ఎక్కువ పనులు చేసింది రాజశేఖర్ రెడ్డేనని చెప్పారు.
News September 21, 2025
ADB: మసకబారుతున్న జ్ఞాపకాలు.. నేడు అల్జీమర్స్ డే

ఒరేయ్, ఏరా అని పిలిచే తాత, నానమ్మ మనల్ని గుర్తుపట్టకపోతే ఎలా ఉంటుంది. ఇలాంటి జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే వ్యాధే అల్జీమర్స్. వృద్ధాప్యంలో కనిపించే ఈవ్యాధితో మొదటగా చిన్న విషయాలు మర్చిపోవడం, మాటల్లో తడబడటం కనిపిస్తుంది. తర్వాత దశలో రోగి తన కుటుంబీకులను గుర్తుపట్టలేని స్థితికి చేరవచ్చు. ఆరోగ్య సమస్యలతో ఈ వ్యాధి వస్తుంది. వృద్ధులే మన అ’పూర్వ’ సంపద వారిని కాపాడుకుందాం. ADBలో 50000+ వృద్ధులున్నారు.