News December 27, 2024

అటవీ సంరక్షణ కమిటీతో కలెక్టర్ చేతన్ సమీక్ష

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతన్ జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్న హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు హాని జరగకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలో చెట్లు నాటే కార్యక్రమానికి అవసరయ్యే మొక్కలకు నర్సరీలు ఏర్పాటు చేసి పెంచాలని సూచించారు.

Similar News

News October 26, 2025

JNTU: OTPRIలో 31న ప్రాంగణ నియామకాలు

image

అనంతపురం జేఎన్టీయూ OTPRIలో ఈ నెల 31న ఉదయం 9:00 గంటలకు B.Pharm, M.Pharm విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు OTPRI డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ సి.గోపినాథ్ ఆదివారం తెలిపారు. 2022-25లో గ్రాడ్యుయేషన్ (B.Pharm, M.Pharm) పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.

News October 26, 2025

నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచండి: ఎస్పీ

image

నేరస్తులు, రౌడీ షీటర్లపై ఉక్కు పాదం మోపినట్లు ఎస్పీ జగదీష్ ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. చోరీలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మట్కా, గుట్కా, చైనీ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను తరలించినా, ప్రోత్సహించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 26, 2025

JNTUలో 28, 29, 30న ఇంటర్వ్యూలు

image

అనంతపురం జేఎన్టీయూలో ఈ నెల 28, 29, 30న కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీంకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో 45 మంది బోధన సిబ్బంది పాల్గొననున్నారు. 28 మంది సీనియర్ ప్రొఫెసర్‌కు, 6 మంది ప్రొఫెసర్‌కు, 11 మంది అసోసియేట్ ప్రొఫెసర్ పదోన్నతులకు దరఖాస్తులు చేసుకున్నట్లు వివరించారు.