News March 26, 2025
అడుగుకు ‘రూపాయి పావలా’ కమీషన్ వసూలు: YCP

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ మరోసారి సంచలన ఆరోపణ చేసింది. ‘నిన్న మొన్నటివరకు చికెన్ షాప్ల మీద పడి దండుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పుడు పొగాకు గోదాములను కూడా వదలడం లేదు. అడుగుకు ‘రూపాయి పావలా’ చొప్పున తనకు రౌడీ మాములు ఇస్తే తప్ప అక్కడ పొగాకు నిల్వ చేయనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే దిగజారుడుతనం చూసి వ్యాపారులు భీతిల్లుతున్నారు’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News November 8, 2025
సీఎం పర్యటనలో లోపాలు లేకుండా పనిచేయాలి: కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయలని సూచించారు.
News November 8, 2025
ఆసీస్తో అయిపోయింది.. సౌతాఫ్రికాతో మొదలవుతుంది

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా టూర్ నేటితో ముగిసింది. రేపు ఆటగాళ్లు స్వదేశానికి రానున్నారు. ఈనెల 14(కోల్కతా) నుంచి సౌతాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 22న(గువాహటి)లో సెకండ్ టెస్ట్ జరగనుంది. తర్వాత 3 వన్డేల సిరీస్ మొదలవుతుంది. 30న తొలి, DEC 3న రెండో, 6న మూడో వన్డే ఆడతారు. అనంతరం 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. 9న తొలి, 11న రెండో, 14న మూడో, 17న నాలుగో, 19న ఐదో టీ20 జరుగుతుంది.
News November 8, 2025
నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

√ఊర్కోండ మండల కేంద్రంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
√ఈనెల 11న కల్వకుర్తి ఐటిఐ కళాశాలలో అప్రెంటిషిప్ మెళా
√రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన జిల్లా ఖోఖో జట్టు
√సోమశిల లో శ్రీశైలం లాంచీ నీ ప్రారంభించిన జిల్లా పర్యాటకశాఖ అధికారి
√NGKL: రేపు కబడ్డీ ఎంపికలు
√ఊర్కోండ పేటలో పెరిగిన భక్తుల రద్దీ.


