News January 7, 2026
అడ్డతీగల: ‘టీచర్స్ వివరాలు అప్ లోడ్ చేయండి’

పోలవరం జిల్లాలో ప్రభుత్వం విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్స్ అందరూ తమ వ్యక్తి గత వివరాలను లీప్ యాప్ లో నమోదు చేయాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు బుధవారం మీడియాకు తెలిపారు. విద్య శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఈ నెల 9లోగా అప్ లోడ్ చేయాలని, మార్పులు, చేర్పులు ఉంటే రెండు రోజుల్లో సరిచేసుకోవాలన్నారు. ఇక గడువు పొడుగుంచబడని, అందరు టీచర్స్ ఆదేశాలు పాటించాలన్నారు.
Similar News
News January 11, 2026
వెల్లంపల్లి హైవేపై ప్రమాదం..ఒకరి స్పాట్ డెడ్

త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News January 11, 2026
రోజుకు ఎన్ని నీళ్లు తాగాలంటే?

మీరు రోజూ తాగాల్సిన నీటి పరిమాణం మీ బరువు, వాతావరణం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. అయితే, రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారంలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే.. పై లక్షణాలు రెగ్యులర్గా కనపడితే అప్రమత్తం అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్గా ఉండటం ముఖ్యమని చెబుతున్నారు.
News January 11, 2026
పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా: ఎమ్మెల్సీ నాగబాబు

పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల రెండో రోజు వేడుకల్లో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో నిజమైన సంతోషాన్ని ఇచ్చింది పిఠాపురం ప్రజలేనని కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపునకు కారకులైన నియోజకవర్గ ప్రజలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ వేడుకలు స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


