News March 29, 2024

అడ్లూరు ఎల్లారెడ్డి శివారులో వ్యక్తి హత్య

image

కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన పెద్ద చెరువు సమీపంలో వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు టవల్ మెడకు బిగించి హత్య చేసినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన కడల సాయిలు (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News September 7, 2025

నిజామాబాద్‌లో చంద్రగ్రహణం

image

నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 8:58 గంటలకు పెనుమంట్ర దశతో ప్రారంభమైంది. పాక్షిక గ్రహణం రాత్రి 9:57 గంటలకు మొదలైంది. సంపూర్ణ గ్రహణం 12:22 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుందని జ్యోతిష పండితులు తెలిపారు.

News September 7, 2025

నిజామాబాద్: SRSP 8 వరద గేట్ల ఓపెన్

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ఆదివారం రాత్రి ప్రాజెక్టు 8 స్పిల్వే వరద గేట్లను ఓపెన్ చేశారు. వాటి ద్వారా 25 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 52,840 క్యూసెక్కుల నీరు వస్తుండగా వరద గేట్లు, ఇతర కాల్వల ద్వారా 53,685 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

News September 7, 2025

నిజామాబాద్: బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నరేష్

image

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బొబ్బిలి నరేష్ బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలందించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సేవలు అందించడంతో ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.