News February 10, 2025
అత్తిలి: నంది అవార్డు అందుకున్న టీచర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739109989622_51988413-normal-WIFI.webp)
అత్తిలి గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు పెద్దపల్లి వెంకటరమణికి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్లో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పురస్కారాల అకాడమీ వారు వెంకట రమణికు అవార్డును అందజేశారు. తెలుగు సాహిత్యం, కవిత్వంలో చేసిన కృషికి ఈ అవార్డు లభించినట్లు వెంకటరమణ తెలిపారు. అలాగే తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జిల్లా అధ్యక్షురాలిగా తనను ప్రకటించినట్లు తెలిపారు.
Similar News
News February 11, 2025
కోకోకు ధర కల్పించాలంటూ సీఎం దృష్టికి..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739194332216_51988413-normal-WIFI.webp)
అంతర్జాతీయ మార్కెట్కు తగ్గట్టుగా కోకోకు ధర కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కోకో రైతులతో ఆయన స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. ఎమ్మెల్యే వెంట వట్టికూటి వెంకట రామారావు, గారపాటి శ్రీనివాస్, వీర్రాజు ఉన్నారు.
News February 10, 2025
తణుకులో సందడి చేసిన స్టార్ హీరోలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739115632224_51228803-normal-WIFI.webp)
తణుకులో స్టార్ హీరోలు ఆదివారం సందడి చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అత్త యలమర్తి రాజేశ్వరిదేవి ఇటీవల మృతి చెందడంతో ఆదివారం తణుకులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు వెంకటేష్, రానా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అభిమానులతో వారు ముచ్చటించారు.
News February 9, 2025
రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739068398894_1221-normal-WIFI.webp)
ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.