News October 29, 2025

అత్యవసరమైతే 100కి కాల్ చేయండి: ఎస్పీ నరసింహ

image

మొంథా తుపాను ప్రభావంతో సూర్యాపేట జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే డయల్ 100 లేదా సూర్యాపేట కంట్రోల్ రూమ్ నంబర్ 8712686026కు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.

Similar News

News October 29, 2025

ఆ పోస్టులు ఖాళీగా లేవు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

image

బిహార్‌లో ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘బిహార్‌లో సీఎం పోస్టు, ఢిల్లీలో ప్రధాని సీటు ఖాళీగా లేవు. ఇక్కడ నితీశ్ ఉన్నారు. అక్కడ మోదీ ఉన్నారు. మీకు (ఆర్జేడీ, కాంగ్రెస్) ఛాన్స్ రాదు’ అని అన్నారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను రక్షించుకునేందుకే ఈ ఎన్నికలని చెప్పారు. ఒక్క పొరపాటు జరిగినా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ప్రజలను హెచ్చరించారు.

News October 29, 2025

WGL: జిల్లాలో 1,554 మి.మీల వర్షపాతం

image

తుఫాన్ కారణంగా వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 1,554 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలో అత్యధికంగా నెక్కొండ మండలంలో 192 మి.మీల, వర్ధన్నపేట-175, ఖిలా వరంగల్-161, పర్వతగిరి-148, సంగేమ్-146, రాయపర్తి-133, WGL-125, ఖానాపురం-119, గీసుగొండ 105 మి.మీ, మిగతా మండలాల్లో 100 లోపు నమోదైంది.

News October 29, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరంగల్, హన్మకొండ నగరాల్లో రోడ్లు, కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సహాయార్థం జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.