News October 28, 2025
అత్యవసర సమయాల్లో ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజల రక్షణకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 24×7 కమాండ్ కంట్రోల్ రూమ్ (8333813228) ఏర్పాటు చేశామన్నారు. చీరాల సబ్డివిజన్ – ఎస్ఐ వి.నాగ శ్రీను (9121104793), బాపట్ల ఎస్ఐ ఎం.విజయ్ కుమార్ (8978777298), రేపల్లె సీసీ డీఎస్పీ పి.రవి ప్రసాద్ (9032030919) ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
Similar News
News October 28, 2025
HYD: స్కిల్ ఉంటేనే ఉద్యోగం!

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డిగ్రీ, పీజీ పట్టాలు చేత పట్టుకుని HYD వస్తున్న వారికి కార్పొరేట్ కంపెనీలు నిరాశ మిగులుస్తున్నాయి. యంగ్ యూత్ ఎంప్లాయబిలిటీ సర్వే ప్రకారం.. పట్టాలు ఉన్న ప్రయోజనం ఉండటం లేదని, ఉద్యోగం దొరకటం లేదని పేర్కొంది. పట్టాతో పాటు స్కిల్ ఉండి, అనుభవం కలిగిన వారికి రూ.40 వేల పైగా శాలరీతో ఉద్యోగాలు వస్తున్నాయని, లేదంటే రూ.15 వేలు రావటం కష్టంగా ఉందని పేర్కొంది.
News October 28, 2025
తిరుమలలో ఈనెల 30న పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. 29న బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణను వసంత మండపంలో నిర్వహించనున్నారు. అంతకు మునుపు మృత్సం గ్రహణం, ఇతర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం, సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
News October 28, 2025
కళాశాలల అభివృద్ధి పురోగతిపై కలెక్టర్ సమీక్ష

భద్రాద్రి జిల్లాలో జూనియర్ కళాశాలల అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై, కళాశాలల్లో చేరికలు, ఉత్తీర్ణత శాతం, అవసరమైన మౌలిక సదుపాయాలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్.. ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. తరగతి గదులు, లీకేజీ నివారణ, విద్యుతీకరణ, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.


