News March 18, 2025
అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.
Similar News
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
ప.గో: ఈ నెల 19న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారని జిల్లా విద్యాశాఖాధికారిని ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులందరూ 18న సాయంత్రం 4 గంటలకు ఏలూరులోని రిసీవింగ్ సెంటర్కు చేరుకోవాలని, అక్కడి నుంచి 19న అమరావతికి బయలుదేరుతారని ఆమె వెల్లడించారు.
News September 18, 2025
ఉత్తరాఖండ్లో పేరేచర్ల యువకుడి మృతి

ఉత్తరాఖండ్లోని రుషికేశ్ ఎయిమ్స్లో వైద్య విద్య అభ్యసిస్తున్న మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన జగదీశ్బాబు (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కష్టపడి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, వైద్య సీటు పొందిన జగదీశ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.