News March 18, 2025

అత్యాచారం కేసులో పేరుసోమల వ్యక్తికి జీవిత ఖైదు

image

అత్యాచారం కేసులో నంద్యాల జిల్లా వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ 2020లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో హరికృష్ణకు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా మహిళా కోర్టు జడ్జి వి.లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు.

Similar News

News February 23, 2026

కల్తీ పాల ఘటన.. 4కు చేరిన మరణాలు

image

AP: రాజమండ్రి కల్తీ పాల <<19213441>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 4కి చేరింది. వెంటిలేటర్‌పై 9 మందికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పాల వ్యాపారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. బాధితుల రక్త, మూత్ర శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. నివేదికలు రావాల్సి ఉంది.

News February 23, 2026

T20 WC: భారత్‌కు అన్నీ ప్రతికూలాంశాలే!

image

T20 WC చరిత్రలో ఇప్పటివరకు హోస్ట్ నేషన్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అలాగే ఏ టీమ్ కూడా వరుస ఎడిషన్లలో ఛాంపియన్ కాలేదు. దీంతో ఈ సెంటిమెంట్లను భారత్ బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2024 WCని గెలవడంతో పాటు ఈసారి SLతో కలిసి IND టోర్నీని హోస్ట్ చేస్తోంది. మరోవైపు S8లో తొలి మ్యాచులోనే ఓడటం, NRR -3.800గా ఉండటం, ప్లేయర్ల ఆట తీరు, తుది జట్టు కూర్పులో సందిగ్ధం జట్టుకు ప్రతికూలంగా మారాయి.

News February 23, 2026

కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

image

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.