News February 7, 2026

అద్దంకిలో ప్రార్థనా మందిరంపై దాడి..!

image

అద్దంకి రామ్‌నగర్‌లోని ఓ ప్రార్థనా మందిరంపై బుధవారం దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంగులూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి చర్చిని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నారు. 15 మంది వ్యక్తులు మందిరంపై దాడిచేసి, లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్బరాజు శుక్రవారం వెల్లడించారు.

Similar News

News February 13, 2026

BIG BREAKING: నిర్మల్‌లో కాంగ్రెస్ విజయం

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 42 వార్డులకు గాను 25 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు బీజేపీ, ఎంఐఎం 2, BRS 1 వార్డు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక్కడ బీజేపీ MLA మహేశ్వర్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.

News February 13, 2026

BREAKING: నర్సంపేట పీఠం కాంగ్రెస్‌దే

image

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 30 వార్డులకు గాను 20 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 7 స్థానాలు, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 16 కంటే అదనంగా మరో నాలుగు స్థానాలు దక్కాయి.

News February 13, 2026

ఏలూరు: హత్య కేసులో జీవిత ఖైదు

image

దెందులూరు మండలం గాలాయగూడెంలో జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితుడు పాలడుగుల దుర్గాప్రసాద్‌కు జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మురళీకృష్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. 2022లో నమోదైన ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసినట్లు దెందులూరు ఎస్సై శివాజీ వెల్లడించారు.