News June 15, 2024
అద్దంకి: టీడీపీ ఫ్లెక్సీల చించివేత
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ మంత్రిగా కేబినెట్లో స్థానం లభించడంతో మండలంలోని మక్కెన వారి పాలెం ఎస్సీ కాలనీలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News October 2, 2024
అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. “https://swarnandhra.ap.gov.in” వెబ్సైట్ ఓపెన్ చేసి పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తిచేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
News October 2, 2024
బాలినేని సైలెంట్కు కారణం అదేనా..?
ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జనసేన గూటికి చేరిన తర్వాత ఒంగోలుకు వచ్చిన బాలినేనికి ఆ పార్టీ నాయకులు కలిసి మద్దతు పలికారు. జనసేనలోకి భారీ చేరికలు ఉంటాయని బాలినేని అప్పుడు ప్రకటించినా.. సైలెంట్ అయ్యారు. పవన్ దీక్షలో ఉండటంతోనే బాలినేని సైలెంట్ అయ్యారని.. తెర వెనుక పక్కా ప్లాన్తో చేరికలపై అడుగులు వేస్తున్నట్లు చర్చ సాగుతోంది.
News October 2, 2024
ఒంగోలు: రైలు కిందపడి వివాహిత సూసైడ్
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలులో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక కేశవస్వామిపేటకు చెందిన దంపతులు శ్రుతి- ప్రసాద్ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రుతి భర్తకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే SI అరుణకుమారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదైంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.