News December 30, 2025
అద్దంకి: ‘డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి’

అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, చిత్తూరు కడప, అనంతపురానికి 50 కేజీల బరువు ఉన్న పార్సిళ్లకు డోర్ డెలివరీ సౌకర్యం ఉంటుందని డీఎం రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. పట్టణ పరిధిలో 10 కిలోమీటర్ల వరకు ఈ సౌకర్యం ఉంటుందని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 30, 2025
2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (1/4)

ఈ ఏడాది జరిగిన నేరాల వివరాలను ఎస్పీ నచికేత్ వివరించారు.
✎ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 5406 మందిపై 5379 కేసులు నమోదు
✎ SC, ST అట్రాసిటీ కేసులు గత ఏడాది 78, ఈ ఏడాది 71 నమోదు
✎ ప్రాపర్టీ నేరాల కేసులు 575 నమోదు. వాటిలో 330 కేసుల ఛేదింపు. పోగొట్టుకున్న సొత్తు విలువ రూ.8.59 కోట్లు.. రికవరి రూ.4.15 కోట్లు
✎ డ్రంకెన్ డ్రైవ్లో 1713 కేసులు నమోదు. 1,251 కేసుల్లో జరిమానా, 49 మందికి జైలు శిక్ష.
<<18714494>>CONTINUE<<>>
News December 30, 2025
రేపటి నుంచి బాల కార్మికుల గుర్తింపు: నల్గొండ ఎస్పీ

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపేందుకు ‘ఆపరేషన్ స్మైల్-11’ సిద్ధమైంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇటుక బట్టీలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరీలో ఉన్న చిన్నారులను రక్షిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
News December 30, 2025
NZB: క్రైమ్ రేట్ తగ్గింది.. సైబర్ క్రైమ్ పెరిగింది: CP

ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో క్రైమ్ రేట్ 4 శాతం తగ్గిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వార్షిక క్రైమ్ నివేదికను వివరించారు. మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసులు స్వల్పంగా పెరిగాయన్నారు. జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామన్నారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠినంగా వ్యవహరించామన్నారు. సైబర్ క్రైమ్లు పెరిగినట్లు చెప్పారు.


