News February 16, 2025

అద్దంకి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పల్నాడు జిల్లా రాజుపాలెం(M) నెమలిపురి దగ్గర అద్దంకి- నార్కెట్ పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళుతున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News December 21, 2025

హిందువులంతా ఐక్యంగా ఉండాలి.. బంగ్లా దాడులపై మోహన్ భాగవత్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులనుద్దేశించి RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి హిందువులు ఐక్యంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హిందువులకు భారతదేశమే ఏకైక ఆశ్రయమని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం తరఫున మరిన్ని గట్టి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.

News December 21, 2025

పాకిస్థాన్‌తో ఫైనల్.. టీమ్ ఇండియా ఓటమి

image

అండర్-19 ఆసియాకప్ ఫైనల్: పాకిస్థాన్‌తో మ్యాచులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైంది. సీజన్ మొత్తం అదరగొట్టిన ఆయుశ్ సేన కీలక మ్యాచులో చేతులెత్తేసింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. హిట్టర్ సూర్యవంశీ(26), జార్జ్(16), అభిజ్ఞాన్(13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36) దూకుడుగా ఆడారు.

News December 21, 2025

SSS: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

image

హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ వరలక్ష్మి తెలిపారు. ఈ నెల 22 నుంచి 30 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో కార్యకర్త 1, 12 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీల భర్తీ పారదర్శకంగా చేపడతామన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.