News November 10, 2024

అధికారంలో వస్తే వారిని వదలం: కాకాణి

image

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు తొడుక్కొని విధులు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. జగన్‌పై అభ్యంతరకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలే తిరగబడతారన్నారు.

Similar News

News February 11, 2026

సాగర మిత్రల సేవలు కొనసాగించండి: వేమిరెడ్డి

image

నెల్లూరు జిల్లాలో మత్స్యశాఖ కింద పని చేస్తున్న సాగర్ మిత్రల సేవలను కొనసాగించాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సాగర్ మిత్రులు గ్రామాలలో ఎన్నో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను మరింత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

News February 11, 2026

రేపే నెల్లూరు జిల్లాకు షర్మిల రాక

image

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఖారారైంది. ఆమె ​ఈనెల 12న ఉదయం 10 గంటలకు మనుబోలు మండలం అక్కంపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కావలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన వివరాలను డీసీసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.

News February 11, 2026

శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

image

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.