News February 9, 2025
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ఎ.కొండూరు కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ.. వివిధ శాఖల సమన్వయంతో విస్తృత జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం విజయవాడ కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
Similar News
News October 25, 2025
ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో AUS 236 రన్స్కు ఆలౌట్ అయింది. 124-2తో పటిష్ఠ స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షా 56, క్యారీ 24, కూపర్ 23 రన్స్ చేశారు. మన బౌలర్లలో రాణా 4, సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాసేపట్లో 237 టార్గెట్తో భారత్ బరిలోకి దిగనుంది. IND వైట్వాష్ నుంచి తప్పించుకుంటుందా? COMMENT
News October 25, 2025
జాగ్రత్త.. పిల్లలకు మేకప్ వేస్తున్నారా?

ప్రస్తుత రోజుల్లో పిల్లలకీ మేకప్ వేయడం సాధారణం అయిపోయింది. స్కూలు ప్రోగ్రాములున్నాయనో, వారు మారాం చేస్తున్నారనో మేకప్ వేస్తున్నారు. కానీ వీటివల్ల తలనొప్పి, త్వరగా నెలసరి రావడం, హార్మోనుల్లో అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తప్పనిసరి అయితే మైల్డ్వీ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లిప్ స్టిక్, మస్కారా వంటివి అస్సలు వాడకూడదని చెబుతున్నారు.
News October 25, 2025
మేడ్చల్ మార్గంలో రైల్వే ETS అప్ గ్రేడేషన్ మంజూరు

మేడ్చల్, మహబూబ్నగర్, ధోనే మార్గంలో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ అప్ గ్రేడేషన్ మంజూరైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రెస్ నోట్ విడుదల చేసింది. రైల్వే మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకోగా, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం (ETS) త్వరలోనే అమలు చేస్తామని పేర్కొంది. ఈ పనులు పూర్తయితే ఎలాంటి అవాంతరాలు లేకుండా రైళ్లు ప్రయాణించడానికి వీలుంటుందని అధికారులు తెలిపారు.


