News February 4, 2025
అధికారులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న అర్జీలు, రీ ఓపెన్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెనింగ్ ఫిర్యాదులపై జేసీ సూరజ్, డీఆర్ఓ మురళిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో40 రీ ఓపెనింగ్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 14, 2025
భూపాలపల్లి: 9 AM 26.40 శాతం పోలింగ్ నమోదు

భూపాలపల్లి జిల్లాలో మలివిడత ఎన్నికల లో 9 గంటల వరకు 26.40 శాతం నమోదైనట్లు డిపిఓ శ్రీలత తెలిపారు. చిట్యాల 27.04 శాతం, భూపాలపల్లి 27.28 శాతం, టేకుమట్ల 23.88 శాతం, పలిమెల 28.50 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. జిల్లాలో 21,841 మంది హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో నాలుగు మండలాల్లో 82,728 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 14, 2025
ఖమ్మం: పోలింగ్ రోజే సర్పంచ్ అభ్యర్థి మృతి

నేలకొండపల్లి మండలం అనాసాగరం ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి దామల నాగరాజు (40) మృతి చెందారు. ఎంఎస్సీ, బీఈడీ చదివి ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్న ఆయన సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. రెండో విడతలో భాగంగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ విషాద ఘటన గ్రామంలో విషాదం నింపింది. నామినేషన్ వేసిన రోజే అస్వస్థతకు గురైన నాగరాజును ఆసుపత్రిలో చేర్పించారు. ఈరోజు బ్రెయిన్డెడ్ అయ్యి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
News December 14, 2025
15న నెల్లూరుకు ఢిల్లీ CM రాక

నెల్లూరు హరినాథపురంలో మాజీ ప్రధాని వాజ్పేయీ విగ్రహావిష్కరణ జరగనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 15న జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆరోజు అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర జరగనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరవుతారని తెలిపారు.


