News March 20, 2025

అధికారులకు సూచనలు చేసిన మేయర్, కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై అధికారులకు వారు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

Similar News

News March 20, 2025

SRPT: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ఆహ్వానం

image

SRPT జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 5 వరకు http://tgobmmsnew.cgg.gov.inలో అప్లై చేసుకుంటే అర్హులైన వారి జాబితాను జూన్ 02న ప్రకటించి, ఒక్కొక్క నియోజకవర్గాలలో సుమారు 4 నుంచి 5వేల యూనిట్లు మంజూరు చేయనున్నారు అని అన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.

News March 20, 2025

గజ్వేల్ MLA క్యాంప్ ఆఫీసుకు TOLET బోర్డు పెట్టిన బీజేపీ

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు టూలెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఎదుట ఆకస్మికంగా ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు కేసీఆర్ గజ్వేల్ రావాలని, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.

News March 20, 2025

సంగారెడ్డి: చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యం

image

చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. పట్టణ సీఐ రమేశ్ వివరాలు ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి (54), కుమార్తె మణిదీపిక(25) అదృశ్యమైనట్లు ఈనెల 17న మెదక్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ చెరువులో తల్లి, కూతుర్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!