News April 1, 2025

అధికారులకు NTR కలెక్టర్ ఆదేశాలు

image

ఏప్రిల్ 1న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల కింద 2,28,813 మందికి రూ. 98.11 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సోమవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ జరపాలని సూచించారు.

Similar News

News November 14, 2025

జిల్లా వ్యాప్తంగా పంచారామాలకి బస్సులు

image

పంచారామ క్షేత్రాల దర్శనానికి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి ఎస్‌కే షబ్నం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News November 14, 2025

ASF: రోడ్డు సౌకర్యం కల్పించండి.. సీఎం ప్రజావాణిలో వినతి

image

ASF జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని TAGS జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ప్రజా భవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి, జోడేఘాట్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.

News November 14, 2025

గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

image

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.