News August 18, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్క‌ర్ సోమవారం సూచించారు. గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని, పారిశుద్ధ్య వ్యవస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. నాగావళి పరివాహక ప్రాంతాలైన సంతకవిటి, రేగిడి, వంగర, ఆర్.ఆముదాలవలస మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

Similar News

News August 18, 2025

VZM: అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు

image

భారీ వర్షాలు కారణంగా జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నతాధికారులు నేడు సెలవు ప్రకటించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ.. అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటనపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో యూనియన్ ప్రతినిధులు ఉన్నతాధికారులను సంప్రదించగా నేడు సెలవును ప్రకటించినట్లు తెలిసింది.

News August 18, 2025

VZM: మీ పింఛన్ ఆగిందా? ఇలా చేయండి..!

image

దివ్యాంగులు, మెడికల్ పింఛన్లు రద్దైన లబ్ధిదారులకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా DRDA కార్యాలయం ఆదివారం తెలిపింది. రీ వెరిఫికేషన్ అనంతరం అనర్హులుగా గుర్తించిన వారు నోటీస్ అందుకున్న 30రోజుల్లోగా అప్పీలు చేయాల్సి ఉందని వెల్లడించింది. పాత సదరంతో పాటు నోటీస్ తీసుకొని సమీప ఏరియా ఆసుపత్రికి వెళ్లి వెరిఫై చేయించుకోవాలని,నిబంధనల ప్రకారం మళ్లీ సర్టిఫికెట్ పొందాలని సూచించింది.

News August 18, 2025

ఈ ఏడాదిలో రూ.25.21 లక్షల సీజ్: VZM SP

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరుకు పేకాట, కోడి పందెలుపై జరిపిన దాడుల్లో మొత్తం రూ.25,21,077 సీజ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై 141 కేసులు నమోదు చేసి 1031 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కోడిపందాలు ఆడుతున్న వారిపై 35 కేసులు నమోదు చేసి 174 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 75 పందెం కోళ్లు, నాలుగు పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.