News September 8, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: KMR కలెక్టర్

జిల్లాలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, రేషన్ కార్డు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జీపీఓలకు మంగళవారం లోగా గ్రామాలు కేటాయిస్తామని తెలిపారు.
Similar News
News September 10, 2025
NZB: సబ్ జూనియర్ బాస్కెట్బాల్ సెలక్షన్స్ నేడు

నిజామాబాద్ జిల్లా బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ మైదానంలో ఇవాళ ఉదయం 11:30కు సబ్ జూనియర్స్ బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు బాస్కెట్బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు. ఈ సెలక్షన్స్లో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాల కోసం ఆర్గనైజింగ్ కార్యదర్శి నిఖిల్ను సంప్రదించవచ్చని సూచించారు.
News September 10, 2025
MBNR: రైతులు ALERT..కృషి విజ్ఞాన కేంద్రం కీలక సూచనలు

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతు పొలాలలో వరి పంటలో ఆకులు చుట్టుకుని పోయి ఆకుల పైన తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. తామర పురుగుల వల్ల ఏర్పడతాయని, వెంటనే వరిసాగు చేసే రైతులు ఫటేరా @4 కిలోలు ఎకరానికి లేదా/ క్లోరన్ త్రినిల్ ప్రోల్ @60 మి.లీ ఎకరానికి లేదా/ ఫిప్రోనిల్ @400 మిల్లీలీటర్లు ఎకరానికిలో పిచికారి చేస్తే దీని ఉద్ధృతి తగ్గుతుందన్నారు.
News September 10, 2025
నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణం: శ్రీనివాసవర్మ

నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏపీకి గర్వకారణంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బి.శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ.. 17.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో పూర్తి చేస్తామన్నారు.