News July 20, 2024
అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి: మంత్రి జూపల్లి

మహిళా సమాఖ్య, రైతులు, స్థానిక ప్రజల సమస్యలపై మంత్రి జూపల్లి చర్చించారు. వీపనగండ్ల మండలంలోని వివిధ అంశాలపై అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన వ్యవస్థను బాగు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అవినీతికి తావు లేదనే సందేశం పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వెళ్లాలన్నారు.
Similar News
News September 4, 2025
MBNR: రేపు వినాయక నిమజ్జనం.. పటిష్ఠ ఏర్పాట్లు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న గణనాథులను రేపు నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పట్టణంలో పలు డైవర్షన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ డైవర్షన్స్కి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో కార్యక్రమంలో నిర్వహించాలన్నారు.
News September 3, 2025
ఉమ్మడి మహబూబ్నగర్లో వర్షాలు

గడిచిన 24 గంటల్లో మహబూబ్నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నేడు ఉదయం 7 గంటల సమయానికి అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 43.5 ఎంఎం వర్షపాతం, గండీడ్ మండలంలో 35.0 ఎంఎం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా అడ్డాకుల మండలంలో 1.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. కౌకుంట్ల మండలంలో మాత్రం ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లావ్యాప్తంగా సగటున 10.9 ఎంఎం వర్షపాతం నమోదైంది.
News September 3, 2025
MBNR:ఓటర్ లిస్ట్.. మొత్తం 4,99,582

1.గండీడ్-32,246, 2. మహమ్మదాబాద్ – 31,291, 3. రాజాపూర్ -21,772, 4. నవాబుపేట -40,193, 5. మిడ్జిల్ -25,128, 6. మూసాపేట-21,549, 7. మహబూబ్ నగర్ రూరల్-34,806, 8. కౌకుంట్ల -16,987, 9. కోయిలకొండ -52,175, 10. జడ్చర్ల – 40,861, 11.హన్వాడ -40,392, 12.దేవరకద్ర -26,239, 13. సీసీ కుంట -31,056, 14. భూత్పూర్ -27,080, 15. బాలానగర్ -33,437, 16. అడ్డాకల్ -24,370 మంది ఓటర్లు ఉన్నారు.