News July 4, 2025

అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ములుగు కలెక్టర్

image

గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఏటూరునాగారం, మంగపేటలోని గోదావరి కరకట్టను ఆయన పరిశీలించారు. రాబోయే వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని సకాలంలో నివాస గ్రామాలను ఖాళీ చేయించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో తగినంత ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

Similar News

News July 4, 2025

మెగా DSC.. రేపు ‘కీ’లు విడుదల

image

AP: మెగా DSCలో జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’లను రేపు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. <>https://apdsc.apcfss.in<<>>లో కీ, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంటాయి. ‘కీ’పై అభ్యంతరాలను సంబంధిత ఆధారాలతో ఈనెల 12వ తేదీలోగా DSC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు. జూన్ 6 నుంచి 28 వరకు జరిగిన పరీక్షల ‘కీ’, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే విడుదల చేశారు.

News July 4, 2025

జగిత్యాల: ‘డ్రెయిన్‌లు, వాగులు తక్షణం శుభ్రపరచాలి’

image

JGTL మునిసిపాలిటీలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద డ్రెయిన్‌లు, వాగులు, ప్రభుత్వ భూముల శుభ్రత పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. గోవిందపల్లి, శంకులపల్లి, సోడా సెంటర్, రామాలయం, SRSP కాలువ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్‌, నీటిపారుదల‌, ఎండోమెంట్ శాఖల సమన్వయంతో పని జరగాలని, ప్రైవేట్ భూముల్లో ముల్లు మొక్కలు తొలగించకపోతే జరిమానాలు విధించాలన్నారు.

News July 4, 2025

రైతులు దుష్ప్రచారాలను నమ్మవద్దు: ఢిల్లీరావు

image

ఎరువుల తయారీదారులు, పంపిణీదారులతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు శుక్రవారం విజయవాడలో సమావేశమయ్యారు. యూరియా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే 30% అధికంగా యూరియా నిల్వలు ఉన్నాయని ఢిల్లీరావు చెప్పారు. ఎరువుల లభ్యతపై రైతాంగం దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. డీలర్‌లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.