News May 9, 2024

అధికారులు బాధ్యతగా పనిచేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి, ఎన్నికల కమీషన్ సూచనలను శత శాతం తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ సమావేశంలో మాట్లాడారు. సెక్టోరియల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 72 గంటలు ప్రొటోకాల్ చాలా కీలకమన్నారు.

Similar News

News October 1, 2024

SKLM: పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి-కలెక్టర్

image

శ్రీకాకుళం నగరంలోని అక్టోబర్ 2న R&B అతిథి గృహం డచ్ బిల్డింగ్ వద్ద జిల్లాస్థాయి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిసరాలను, నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అధికారులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఈ సమావేశానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.

News September 30, 2024

శ్రీకాకుళం: దసరా సెలవులకు ఊర్లకు వెళ్తున్నారా జార జాగ్రత్త

image

దసరా సెలవులు నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు లాక్డ్ హౌసింగ్ మోనిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందించాలని చెప్పారు. ఎల్‌హెచ్ ఎంఎస్ ద్వారా ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే ఇంటి యజమానికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తుందన్నారు.

News September 30, 2024

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల UPDATES

image

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మొదటి రోజున అమ్మవారిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, రూ.20, రూ.50 దర్శనాలను కల్పించనున్నారు.