News December 23, 2025
అధికారులే అన్నీ చూసుకున్నారు.. సిట్ ప్రశ్నలపై చెవిరెడ్డి!

AP: తిరుమల కల్తీ నెయ్యి విషయంలో SIT ప్రశ్నలకు YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. టెండర్ రూల్స్లో మార్పులపై ప్రశ్నించగా, అధికారులే చూసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారు చెబితేనే కొనుగోలు కమిటీ సిఫార్సులు ఆమోదించానని అన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చెవిరెడ్డిని SIT 4గంటలపాటు విచారించింది. అప్పట్లో TTD కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఉన్నారు.
Similar News
News January 6, 2026
త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో షెడ్యూల్ వెలువడొచ్చని CM, PCC చీఫ్ పార్టీ ముఖ్య నేతలను అలర్ట్ చేస్తున్నారు. షెడ్యూల్ లోపే పెండింగ్ పనులు పూర్తిచేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో పెండింగ్ పనులను గుర్తించి పూర్తిచేసేలా నిధులు విడుదల చేయించాలని CM మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.
News January 6, 2026
కోహ్లీ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడు: మంజ్రేకర్

విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో ఆడటాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. ‘టెస్టుల్లో జో రూట్ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాడు. కానీ విరాట్ టెస్టులను వదిలేశాడు. రిటైర్మెంట్కు ముందు అతడు ఇబ్బందిపడటం నిజమే. కానీ ఎందుకు విఫలమవుతున్నాడనేది మనసు పెట్టి ఆలోచించలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్కు ఈజీ ఫార్మాట్ అయిన వన్డేలను కోహ్లీ ఎంచుకోవడం నిరాశకు గురిచేసింది’ అని పేర్కొన్నారు.
News January 6, 2026
మార్చిలో అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్: మంత్రి

TG: రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్ ద్వారా ఒకే గొడుగు కిందకు తెస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘వ్యవసాయ, వ్యవసాయేతర, దేవదాయ, అటవీ, వక్ఫ్ భూముల వివరాలన్నీ పోర్టల్లో పొందుపరిచాం. ప్రజలకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందేలా రూపొందించాం’ అని చెప్పారు. మార్చిలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.


