News December 3, 2025

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి

image

అనంతగిరి కొండల్లో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అటవీ సంరక్షణ చార్మినార్ జోన్ అధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. బుధవారం అనంతగిరి కొండల్లో ఎకో టూరిజం అభివృద్ధి పనులను కొండపై అటవీ శాఖ అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను, నాటిన మొక్కలను పరిశీలించారు. అడవుల సంరక్షణతో పాటు పర్యాటకులకు అనంతగిరి కొండపై సౌకర్యాలు కల్పించే అభివృద్ధి చేయాలన్నారు.

Similar News

News December 3, 2025

GHMCలో పురపాలికల విలీనంపై ప్రొసీడింగ్స్

image

ORR వరకు 27 మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి GHMC కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ విడుదల చేశారు. పురపాలక సంఘాల రికార్డుల పరిశీలన కోసం GHMC డిప్యూటీ కమిషనర్లు, మానిటరింగ్ ఆఫీసర్లుగా జోనల్ కమిషనర్లను నియమించారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పురపాలిక అకౌంటు బ్యాలెన్స్ సైతం GHMC అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేయాలని పేర్కొన్నారు.

News December 3, 2025

వాస్తు శాస్త్రం అంటే ఏమిటి?

image

మనిషి మనుగడ, రక్షణకు దోహదపడుతున్న నివాసాలు, నిర్మాణాల గురించి వివరించేదే వాస్తుశాస్త్రం అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. వాస్తు అంటే వాస్తవం అని, వస్తువు అమరిక వినియోగంతో ప్రయోజనం కలిగించేదే వాస్తు శాస్త్రమని అంటున్నారు. ‘పకృతిలో జరిగే మార్పులు, సమయం, అవగాహన, అనుభవాల వ్యత్యాసాల వల్ల వాస్తు ఫలితాలలో మార్పులు సంభవించవచ్చు. వీటికి ఎవరూ అతీతులు కారు’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 3, 2025

REWIND: రంగారెడ్డిలో 135 ఏకగ్రీవం.. రూపాయి రాలేదు

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఏకగ్రీవ చిన్న పంచాయతీలకు రూ.10లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,185 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసినా ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా పారితోషకం అందలేదు.