News November 14, 2024

అనంతపురంలో ముగ్గురి అరెస్ట్.. 21 తులాల బంగారం స్వాధీనం

image

అనంతపురంలోని కృపానంద నగర్‌లో ఇటీవల చోరీ జరిగింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువ చేసే 21 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయస్థులే ఈ చోరికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు చేధించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Similar News

News September 13, 2025

ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

image

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.

News September 12, 2025

5 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: జేసీ

image

జిల్లాలో కొత్త స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో 6,57,828 రేషన్ కార్డుదారులకు ఈనెల 15 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందిస్తామని చెప్పారు.

News September 11, 2025

అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ ఈయనే!

image

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్‌గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. కేరళ రాష్ట్రం మలప్పురంలో జన్మించిన ఆయన కేరళ యూనివర్సిటీలో బీటెక్ పట్టభద్రుడయ్యారు. 2016 IAS బ్యాచ్‌కు చెందిన ఆనంద్ కేవలం 24 ఏళ్ల వయస్సులోనే IAS అయ్యారు. UPSC పరీక్షలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుత కలెక్టర్ డా.వినోద్ కుమార్ బాపట్ల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.