News August 15, 2025
అనంతపురంలో వ్యభిచారం.. పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై అనంతపురం పోలీసులు దాడి చేసి, నిర్వాహకులు, విటులను గురువారం అరెస్టు చేశారు. నగరంలోని వెంకటస్వామి వీధిలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణ పోలీసులు గురువారం దాడి చేశారు. నిర్వాహకురాలు పుల్లమ్మ, విటులు వెంకటపతి, నాగరాజు, పెద్దిరెడ్డిని అరెస్టు చేశారు. నలుగురు యువతులను కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News August 15, 2025
KNR: గ్రామాల్లో మళ్లీ VRO, VRAల వ్యవస్థ!

గ్రామపాలన అధికారులు(GPO)గా VRO, VRAలు మళ్లీ విధుల్లో చేరనున్నారు. వీరికి నిన్ననే నియామకపత్రాలు అందాల్సి ఉండగా వర్షాలతో కుదర్లేదు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలంటే VRO, VRAల అవసరం తప్పనిసరని గుర్తించిన ప్రభుత్వం వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఉమ్మడి KNRలో విధుల్లో చేరడానికి 2800మంది సుముఖత చూపగా KNR నుంచి 540మంది VRAలు, 300మంది VROలు కంబ్యాక్ అయ్యారు.
News August 15, 2025
అనకాపల్లి: జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హోం మంత్రి

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఎస్పీ తుహీన్ సిన్హా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
News August 15, 2025
కరప: ఉప్పు సత్యాగ్రహానికి బీజం ఇక్కడే.!

కరప(మ)గురజనాపల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిగా నిలిచింది. జాతిపిత గాంధీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించిన చోటు ఇదే. గాంధీ ఇక్కడికి వచ్చి ఉప్పు తీసుకుని వెళ్లారని పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రాంతం నేటి రోజుల్లో కూడా ఉప్పు పంట పండిస్తుంది.79 ఏళ్లు గడిచినా,ఉప్పు పంట స్వాతంత్ర్య కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తుంది. గ్రామస్థులందరి గౌరవం స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలు సమాజంలో స్మరణీయంగా నిలుస్తున్నాయి.