News July 11, 2024
అనంతపురంలో 12న ఉద్యోగ మేళా
అనంతపురం నగరంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పూల్ క్యాంపస్ డ్రైవ్ సంస్థ వైస్ ఛైర్మన్ చక్రధర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2023, 2024లో బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 8.30 గంటలకు అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరుకావాలన్నారు.
Similar News
News September 30, 2024
నారా లోకేష్ను కలిసిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి
విజయవాడలోని ఏపీ సచివాలయ ఛాంబర్లో మంత్రి నారా లోకేష్ను తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలుగు మహిళా నేతలు పాల్గొన్నారు.
News September 30, 2024
గన్మెన్లను వెనక్కు పంపిన అనంతపురం MLA?
అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్మెన్లను వెనక్కు పంపారు. రాప్తాడు వైసీపీ నేత మహానందరెడ్డికి ప్రభుత్వం గన్మెన్లను కేటాయించడంతో నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానందరెడ్డి గతంలో ముగ్గురి హత్య కేసులో నిందితుడు. దీంతో సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్మెన్లను ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
News September 30, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.47
అనంతపురంలో టమాటా ధర వారం రోజులుగా నిలకడగా ఉంది. కక్కలపల్లి మార్కెట్లో కిలో రూ.47 పలికినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మార్కెట్కు 1350 టన్నుల టమాటాలు వచ్చాయని చెప్పారు. సరాసరి ధర కిలో రూ.38, కనిష్ఠంగా రూ.30 పలికినట్లు పేర్కొన్నారు. ధరలు నిలకడగా కొనసాగుతుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది.