News January 28, 2025
అనంతపురం జిల్లాలో కాకి వాలని కొండ ఎక్కడుందో తెలుసా?

అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి సమీపంలో ఉన్న రామప్ప కొండకు ప్రత్యేక చరిత్ర ఉంది. అనాది కాలం నుంచి ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలదని వినికిడి. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ కొండపై కాలు మోపారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి కాకి వాలని కొండగా దీనిని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ కొండపై కాకి వాలకపోవడం గమనార్హం. శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని చరిత్ర.
Similar News
News November 4, 2025
వరి పంటను ముందే కోస్తే ఏం జరుగుతుంది?

వరి పంటను ముందుగా కోసినట్లయితే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక, కంకిలోని చివరి గింజలు పూర్తిగా నిండుకోక చాలా సన్నగా పొట్ట తెలుపు కలిగి ఉంటాయి. దీని వల్ల మిల్లింగ్ చేసినప్పుడు నిండు గింజల దిగుబడి తగ్గి అధికంగా నూక, తౌడు వస్తాయి. గింజలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ పంటను సకాలంలో కోత కోయక పోతే గింజలు ఎక్కువగా ఎండి రాలిపోవడమే కాకుండా పగుళ్లు ఏర్పడతాయి.
News November 4, 2025
మెట్పల్లి: నిజాయితీ చాటుకున్న యువకుడు

మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు జెట్టి నరేంద్ర తన ఇంటి బయట రోడ్డుపై పడిపోయిన ఫోనును గుర్తించాడు. దానిని తీసి వెంటనే చుట్టుపక్కల వారిని ఫోను ఎవరిదని వివరాలు అడగగా.. ఎవరు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆ ఫోనును స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేసి పోగొట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్ అందజేయాలని ఆయన కోరారు. ఎండి ముక్తార్, జెట్టి నరేష్ ఉన్నారు.
News November 4, 2025
మెట్పల్లి: మా కష్టం చూసి దేవుడూ కరగడా..?

ఆరుగాలం కష్టం.. అంతా వృథా. MTPL(M) మెట్లచిట్టాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపక్కన నిలబడి, కన్నీరు పెట్టుకున్నఓ మహిళా రైతు ఆవేదన ఎవరికి చెప్పేది? మొన్న తుఫాను, నిన్న మొలకలు. 2 రోజులు ఎండ వచ్చిందని ఆరబెడితే, కుప్ప అడుగుభాగంలోనే ధాన్యం మొలకెత్తింది. ‘నష్టపోయిన మాపై దేవుడికి కూడా చిన్నచూపేనా?’ అంటూ గుండెలు బాదుకుంది. కష్టపడి పండించిన ధాన్యం ఇలా పాడవడం చూసి ఆ అన్నదాత కన్నీరు ఆపడం ఎవరి వశంకాలేదు.


