News July 3, 2024
అనంతపురం జిల్లాలో కేరళ వాసి అబ్దుల్ మృతి
డీ.హీరేహల్ మండలంలో కేరళ వాసి అబ్దుల్ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారి-బెంగళూరు హైవేపై ఓ డాబాలో స్వీపర్గా పనిచేస్తున్నాడని, పని ముగించుకుని వెళ్లిన గంట సేపటికే హైవే పక్కన అబ్దుల్ పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించారని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News July 5, 2024
కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన పయ్యావుల
ఢిల్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన వివిధ శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై మెమోరాండాన్ని అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపు గురించి చర్చించారు.
News July 5, 2024
బ్రహ్మోత్సవాలకు రండి.. మంత్రి సవితకు శ్రావణి ఆహ్వానం
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. పెనుకొండలో కలిసిన ఆమె గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.
News July 5, 2024
అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.