News July 5, 2024

అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

image

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 8, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీగార్డు దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మీనారయణ విధులు ముగించుకుని బైక్‌లో వెళుతుండగా బత్తలపల్లి మండలం ముష్టూర్ వద్ద కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.

News July 8, 2024

నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అభిషేక్

image

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం1 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. 

News July 7, 2024

డి.హీరేహల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి స్పాట్ డెడ్ 

image

రహదారిపై అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన డి.హీరేహల్ మండలంలో ఆదివారం జరిగినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై వేగంగా వెళుతూ ఓబుళాపురం వద్ద అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో మహబూబ్ బాషా(21) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బళ్లారికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.