News September 23, 2024
అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి
అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా రామచంద్రారెడ్డి నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న ఓబులమ్మను కడప జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీ చేశారు. రామచంద్రారెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా DWMAలో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
Similar News
News September 29, 2024
పింఛన్ పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం జిల్లాలో అక్టోబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పకడ్బందీగా పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి నగదు అందజేయాలని సూచించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 28, 2024
ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 37.0 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
News September 28, 2024
అనంత: 10 ఏళ్ల చిన్నారిపై VRA అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో నిన్న పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను ఆ గ్రామ VRAగా పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపాలుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు.