News February 24, 2026

అనంతపురం: భార్యపై కొడవలితో దాడి చేసిన భర్త

image

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన ఘటన అనంతపురంలో మంగళవారం జరిగింది. పాతూరులో నివాసం ఉంటున్న గౌరమ్మ తలపై భర్త నాగభూషణం కొడవలితో తీవ్రంగా దాడి చేశాడు. గాయపడ్డ ఆమెను స్థానికులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌరమ్మ చికిత్స పొందుతోంది. సమాచారం తెలుసుకున్న ఒకటవ పట్టణ పోలీసులు నిందితుడు నాగభూషణంను అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News February 24, 2026

థాయ్‌లాండ్‌లో కొత్త వైరస్.. జూపార్క్‌లో ‘బయో- బబుల్’

image

‘థాయ్‌లాండ్ మరణాలు ఒక హెచ్చరిక.. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవం మా లక్ష్యం’ అని నెహ్రూ జూపార్క్ సిబ్బంది తెలిపారు. శానిటైజేషన్‌కే పరిమితం కాకుండా, వన్యప్రాణుల మధ్య ‘సోషల్ డిస్టెన్సింగ్’ ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను పెంచారు. వైరస్ మ్యుటేషన్ చెందకుండా సోడియం హైపో క్లోరైడ్, జంతువుల ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్లను ఇస్తున్నారు. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు యుద్ధం అని వివరించారు.

News February 24, 2026

జగిత్యాల: ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి మహిళ ఆత్మహత్య

image

జగిత్యాల మండలం ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన అనూష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనూష కుటుంబం గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఈరోజు ఉదయం విజయవాడ నుంచి వచ్చిన కొందరితో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో, అవమాన భారంతో అనూష ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News February 24, 2026

PDPL: ఇంటర్ పరీక్షల్లో ఆ నిబంధన తొలగింపు!

image

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ‘నిమిషం ఆలస్యం’ నిబంధనను బోర్డు ఎత్తివేసిందని జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో 10,367 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు.