News August 10, 2024

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

image

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కలబురగి-బెంగళూరు మధ్య ప్రయాణిస్తాయన్నారు. బెంగుళూరు నుంచి రైలు (06533) ఆగస్టు 14, 16, 17వ తేదీల్లో రాత్రి 9 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ఈ రైలు తిరుగు ప్రయాణం (06534) 15, 17, 18వ తేదీల్లో కలబురగిలో ఉదయం 9.30కు బయలుదేరి రాత్రి 8కి బెంగళూరుకి చేరుకుంటుంది.

Similar News

News November 11, 2025

వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

image

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 11, 2025

వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

image

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 10, 2025

కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.